హైదరాబాద్ నగరం అంబర్ పేట్ డివిజన్ ను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పరుస్తున్నామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. రఘునాథ్ నగర్ లో, లోప్రెషర్ వస్తుండడంతో, సంబంధిత అధికారులను పిలిచి సమస్యను ఆయన పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్థానిక బస్తీ ప్రజలతో కలిసి రఘునాథ్ నగర్ లో పర్యటించారు.
రఘునాథ్ నగర్ లో ఉన్న సమస్యలు కమ్యూనిటీ హాల్ పైనా ఇంక్కో ఫ్లోర్ నిర్మించాలని, నూతన రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని స్థానిక బస్తీ ప్రజలు కార్పొరేటర్ కి వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ.కుషాల్, స్థానిక బస్తీ నాయకులు ఈశ్వర్, రమేష్ కుమార్, లక్ష్మణ్, రాజు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రంగు ఉదయ్ గౌడ్, సంతోష్ చారి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట