37.2 C
Hyderabad
May 6, 2024 22: 35 PM
Slider ముఖ్యంశాలు

రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

#congressparty

ఎఐసిసి పిలుపు మేరకు,నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్,విద్యుత్ ధరలకు నిరసనగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను నిరసిస్తూ ముందుగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రేస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తమ నిరసన తెలిపారు.

వంటగ్యాస్,పెట్రోలు,డీజిల్,విద్యుత్ చార్జీలు,నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.పెట్రోలు,డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ద్విచక్ర వాహనాన్ని తాళ్ళతో లాగుతూ వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు.

ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేయాలని కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి,    ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ తదితరులు డిమాండ్  చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సి.యం కెసిఆర్ ధాన్యం అమ్మం,కొనం అని కేంద్రానికి చెప్పి సంతకాలు చేసి వచ్చి ఇప్పుడు కేంద్రం ధాన్యం కొనాలని ప్రజలను మోసం చేస్తూ కపట నాటకాలు అడుతున్నారని అన్నారు.పెట్రోలు,డీజిల్,వంటగ్యాస్,నిత్యవసర వస్తువులు,విద్యుత్ చార్జీల ధరలు తగ్గించక పోతే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,బాచిమంచి గిరిబాబు,రాష్ట్ర నాయకుడు మహ్మద్ అజీజ్ పాషా,సైదా,జక్కుల మల్లయ్య, ముశం సత్యనారాయణ,మేళ్ళచెరువు ముక్కంటి,వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గుండె పోటులో మరణించిన సరోజ్ ఖాన్

Satyam NEWS

ఇండియా-పాక్‌ మ్యాచ్ కు దిమ్మదిరిగే వ్యూస్

Sub Editor

అంతిమయాత్రలో విషాదం.. 18 మంది మృతి

Sub Editor

Leave a Comment