40.2 C
Hyderabad
May 5, 2024 18: 58 PM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

#hujurnagar

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు,నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆదేశాలతో బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు  అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణం లోని విద్యుత్ ఉప కేంద్రం ముందు తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి తమ నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిచేసిన ఘనుడు కెసిఆర్ అని,కెసిఆర్ అధికారంలో రాకముందే కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించారని,రైతులకు ఏకకాలంలో ఋణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. కెసిఆర్ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో  చేసిన మోసాన్ని ప్రజలందరూ గుర్తించారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని,  హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి,పద్మావతి రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఇప్పటికే ఖాయం అయిపోయిందని,కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద ప్రజలకు,రైతులకు,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,మాజీ జడ్పిటిసి  గల్లా వెంకటేశ్వర్లు,పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు ఎడవల్లి వీరబాబు,జక్కుల మల్లయ్య, గొట్టముక్కల రాములు,కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,చింతలపాలెం వర్కింగ్ అధ్యక్షుడు నందిరెడ్డి ఇంద్రారెడ్డి, మున్సిపల్ వార్డు కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు,ముషం సత్యనారాయణ,బెల్లంకొండ గురవయ్య గౌడ్,మేళ్ళచెరువు ముక్కంటి,పోతన బోయిన రామ్మూర్తి,చప్పిడి సావిత్రి,బంటు సైదులు,కంకణాల పుల్లయ్య,బెల్లంకొండ వెంకట్ నారాయణ,రేపాకుల కోటయ్య, తెప్పని ఎలమంద,దాసరి రాములు,దాసరి పున్నయ్య,పులి బాలకృష్ణ,కందుల వినయ్, రెడిపంగు రాము,కస్తాల సైదులు,షేక్ ఉద్దండు,షేక్ ముస్తఫా,దొంతగాని జగన్, జింజిరాల సైదులు,వీరేష్ గౌడ్,మార్క్స్, కందుకూరి రాము,గడ్డము అంజి,గజ్వేల్ వెంకటేశ్వర్లు,నాయుడు అధిక సంఖ్యలో యూత్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

నోముల భగత్ కు ఎమ్మార్పీఎస్ టీఎస్ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

మేళ్ళచెరువు మహాశివరాత్రి జాతరలో మొదటిసారిగా రికవరీ వ్యాన్ విధులు

Satyam NEWS

జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Bhavani

Leave a Comment