సూర్యాపేట జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ కొరకు కఠినంగా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం లో ట్రాఫిక్ నియత్రణ రికవరీ వ్యాన్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ రికవరీ వ్యాన్ ను మొదటిసారిగా మేళ్ళచెరువు మహాశివ రాత్రి జాతరలో ఉపయోగిస్తున్నామని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శివరాత్రి జాతరలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే వాహనాలను సీజ్ చేసి రికవరీ వ్యాన్ తో తరలిస్తామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులు వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో పెట్టుకోవాలని,ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే విధంగా జాతర ప్రాంగణంలో రోడ్లపై వాహనాలు నిలిపితే రికవరీ వ్యాన్ తో సీజ్ చేస్తామని అన్నారు.
ట్రాఫిక్ అంతరాయం కలిగించే వాహనాలు సీజ్ చేస్తామని,ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు భాగస్వామ్యం కావాలని కోరారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్