ఇటీవల నూతనంగా తెలంగాణ రాష్ట్ర బిజేపి అధ్యక్షులుగా నియమితులైన గంగాపురం కిషన్ రెడ్డి నిర్మల్ జిల్లా బిజేపి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో పుష్ప గుచ్చాలతో సన్మానించారు. హైదరాబాద్ లోని బీజేపి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ, రాష్ట్ర నాయకులను కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజేపి జాతీయ ఉపాధ్యక్షరాలు డీకే అరుణని, జాతీయ నాయకులు, రాష్ట్ర సహా ఇంచార్జి అరవింద్ మీనన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావులను నిర్మల్ జిల్లా బిజేపి అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అమర వేణి నర్సాగౌడ్, బిజేపి ఓబీసీ గీత సేల్ రాష్ట్ర కో కన్వీనర్ రాగుల కిరణ్ కుమార్ గౌడ్ లతొ పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిజేపి ని అధికారంలోకి తెచ్చేవిధంగా చూడాలని కోరారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం అవినీతి ని ఎండకడుతు ప్రభుత్వం ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన విషయాలు ప్రజలకు తెలియ జేస్తు కేంద్ర ప్రభుత్వ పతకాలు ప్రజలలోకి తీసుకు వెళ్లి కార్యకర్త లను కలుపుకొని ఉద్యమిచి డబుల్ ఇంజన్ సర్కార్ ను తెచ్చుకోవాలని ఆ దిశగా పని చేయాలని పిలుపునిచ్చారు.
సత్యం న్యూస్, అంబర్పేట్