38.2 C
Hyderabad
April 29, 2024 11: 57 AM
Slider కడప

ఉగ్ర రూపం దాల్చిన పెన్నా నది

#riverpenna

పెన్నా నది ఉగ్ర రూపం దాల్చింది. అనంతపురం లో కురుస్తున్న వర్షాలకు గండికోటలోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దాంతో కడప జిల్లా మైలవరం ప్రాంతంలోని పెన్నా పరివాహక ఏరియాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గండికోట రిజర్వాయర్ నుంచి మైలవరం కు 25 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మైలవరం నుంచి పెన్నా నదికి 25 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నది. మైలవరం పూర్తి సామర్థ్యం 6.5ల టిఎంసి కాగా ప్రస్తుతం మైలవరంలో 5.8 టిఎంసి ల వాటర్ నిల్వ ఉంది. గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26.85 టిఎంసిలు కాగా ప్రస్తుతం గండికోటలో 25.3 టిఎంసిల నీరు నిలవ ఉంది.

Related posts

ఎరువుల్లేక అల్లాడుతున్న రైతాంగం

Satyam NEWS

ప్రాణం తీసిన ముగ్గు

Bhavani

ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన హిమాన్షు

Satyam NEWS

Leave a Comment