కొల్లాపూర్ MRO ఆఫీసు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎల్లూరు గ్రామ రైతులకు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీంతలపల్లి జగదీశ్వర్ రావు సంఘీభావం వ్యక్తం చేశారు. పాలమూరు -రంగారెడ్డి భూ నిర్వాసిత రైతులు అయిన వీరిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులు దీక్షలు చేస్తుంటే MLA చోద్యం చూస్తున్నారా అంటూ జగదీశ్వర్ రావు ప్రశ్నించారు. అన్నదాతలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలే వారిని నట్టేట ముంచుతున్నాయని మండిపడ్డారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 30లక్షలు,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని,ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీంతలపల్లి జగదీశ్వర్ రావు హెచ్చరించారు.
ఈ నిరాహార దీక్షలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీశ్వర్, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము యాదవ్, టీపీసీసీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి MD పాషా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటే శివన్న, కొల్లాపూర్ టౌన్ అధ్యక్షులు కాంతారావు, కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సంపంగి నర్సింహా, పూటపాగా చిన్న రాముడు,శీలం వెంకటేష్, మల్లేశ్వరం కురుమయ్య, ఎల్లూరు గోపి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.