పాలేరులో అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ గెలుపు ముఖ్యమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలేరు పోటీచేయాల్సిందిగా వారు పొంగులేటిని కోరడంతో అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ గెలుపు ముఖ్యమని సూచించారు.
మండల, గ్రామ, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని తెలిపారు. గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పాత, కొత్త కాంగ్రెస్ అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి , హరినాథబాబు, కళ్లెం వెంకటరెడ్డి, గోనె భుజంగ రెడ్డి, మద్ది కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, బోడా వెంకన్న, సుదగాని ఉపేందర్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాగండ్ల శ్రీనివాసరావు, లింగా శ్రీనివాసరావు, కొమ్మినేని వెంకటేశ్వర్లు, నాగమణి, నెల్లూరి భద్రయ్య, మామిడి వెంకన్న, కట్టెకోల నాగర్జున, సుబ్రమణ్యం, వంగావీటి రవి, శ్రీనాథ్, జాన్ రెడ్డి, మైసయ్య, చంద్రారెడ్డి, బెల్లం వాసు, ఖాజుద్దీన్, మీసా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.