రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాదులో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలకు జిల్లా నుండి వెలుతున్న ప్రజా ప్రతినిధుల వాహనాలను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
శుక్రవారం హైద్రాబాదు నగరంలో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలకు వెలుతున్న ప్రజాప్రతినిధుల వాహనాలను జిల్లా పరిషత్ ఆవరణలో వారు జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమం లో అదనపు కలెక్టర్ డి.మాధసూదన్ నాయక్, జడ్ పి సి ఈ ఓ వి వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.