తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఇదే మనందరి లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్యతో కలిసి పర్యటించారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలంగాణలోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు. ప్రజలు ఆశీస్సులతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు.