ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొరలుతున్నాయి. మునేరు, బుడమేరు, పీలేరు నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుతున్నది. దాంతో బ్యారేజ్ 25 గేట్లు నాలుగు అడుగులు, 45 గేట్లు మూడు అడుగుల మేరకు ఎత్తారు.
1, లక్షల 61,వేల 775 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నది తీర దిగువ ప్రాంతం లో నివసించే వారిని రెవిన్యూ అధికారులు అప్రమత్తం చేశారు.