28.7 C
Hyderabad
May 5, 2024 10: 26 AM
Slider అనంతపురం

ప్రతిపక్షాలను అడ్డుకోవడం అప్రజాస్వామికం

#vishnuvardhanreddy

ప్రతిపక్షాల వారు ఎవరూ రోడ్లపైకి రాకూడదు అని నిషేధించడం ఒక విచిత్ర నిర్ణయం అని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. సభలు సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీల హక్కు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ వై ఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. తప్పు చేసిన వ్యక్తులు , పార్టీ పై చర్యలు తీసుకోండి. అంతే కానీ అందరిపై నిషేధం విధిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

Related posts

ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ విజయవంతం చేయాలి

Satyam NEWS

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

Murali Krishna

ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహుర్తం ఖ‌రారు

Sub Editor

Leave a Comment