ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభకు వృద్ధులను కూడా బలవంతంగా తీసుకురావడంతో ఒక దారుణం జరిగింది. జగన్ సభకు రావాలని బలవంతం చేసి తీసుకువచ్చిన ఒక వృద్ధురాలు బస్సు దిగుతుండగా వేరే బస్సు రావడంతో పెను ప్రమాదం జరిగింది. ఆమె కాలుపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె కాలు నుజ్జునుజ్జు అయింది.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ లో వై ఎస్ ఆర్ పింఛను కానుక సభను జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఈ సభకు 70 ఏళ్ళకు పైగా ఉన్న వృద్ధులను సైతం వాలంటీర్లు బలవంతంగా తీసుకువచ్చారు. ఆ బస్సు నుండి దిగుతూ వృద్ద మహిళ ఒకరు జారి పడిపోయారు. వెంటనే పక్కన వేరే వాహనం ఆ వృద్ధురాలు మీదకు ఎక్కడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు.