40.2 C
Hyderabad
May 5, 2024 17: 30 PM
Slider పశ్చిమగోదావరి

జగన్ సభలో వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జు

#Jagan Sabha

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభకు వృద్ధులను కూడా బలవంతంగా తీసుకురావడంతో ఒక దారుణం జరిగింది. జగన్ సభకు రావాలని బలవంతం చేసి తీసుకువచ్చిన ఒక వృద్ధురాలు బస్సు దిగుతుండగా వేరే బస్సు రావడంతో పెను ప్రమాదం జరిగింది. ఆమె కాలుపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె కాలు నుజ్జునుజ్జు అయింది.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ లో వై ఎస్ ఆర్ పింఛను కానుక సభను జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఈ సభకు 70 ఏళ్ళకు పైగా ఉన్న వృద్ధులను సైతం వాలంటీర్లు బలవంతంగా తీసుకువచ్చారు. ఆ బస్సు నుండి దిగుతూ వృద్ద మహిళ ఒకరు జారి పడిపోయారు. వెంటనే పక్కన వేరే వాహనం ఆ వృద్ధురాలు మీదకు ఎక్కడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు.

Related posts

క్రాస్ ఓటింగ్ భయంతో రంగంలోకి గూఢచారులు

Satyam NEWS

వర్గీకరణకు మద్దతు ఇవ్వకుంటే బీజేపీకి అధోగతే

Bhavani

కే ఏ పాల్ పై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి

Satyam NEWS

Leave a Comment