రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరలో ఈనెల 10వ తేదీన స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుందని వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈరోజు విలేకరుల సమావేశంలో డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ తో కలిసి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, గౌరవ అతిథిలుగా ఉన్నత విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రా రెడ్డి, దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా వి రాజన్న టెక్నాలజీ బిజినెస్ యూనిట్ టిసిఎస్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, రాజకీయ ప్రముఖులు వచ్చేస్తున్నారని తెలిపారు.
గౌరవ ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు ప్రత్యేక అతిధులు, రాజకీయ ప్రముఖులు ఈనెల 10వ తేదీ ఉదయం 9:30 నిమిషాలకు ఆర్జీయూకేటీ బాసరకు చేరుకుంటారని తెలిపారు. ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్, ఇతర అధికారులు వారికి స్వాగతం పలకడం జరుగుతుందన్నారు. తదనంతరం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గల కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రుల చేతులమీదుగా యూనిఫామ్స్, లాప్టాప్స్, షూలను(బూట్లు) విద్యార్థులకు అందజేయనున్నట్లు తెలిపారు.
అక్కడినుండి స్నాతకోత్సవం గౌరవ వస్త్రాలను ధరించి వేదికను అలంకరిస్తారన్నారు. ప్రార్థన గీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని, వైస్ ఛాన్స్లర్ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. తదనంతరం విద్యార్థుల చేత దీక్ష చేయించి బ్రాంచ్ ల వారిగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 38 బంగారు పథకాలను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రదానం చేస్తారన్నారు.
ఆ తదనంతరం ముఖ్య అతిథి ప్రసంగించనున్నట్లు తెలిపారు. చివరగా సమావేశ ముగింపుకు విషయాలను డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ తెలపనున్నట్లు పేర్కొన్నారు. స్నాతకోత్సవానికి సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయన్నారు. ఈ స్నాతకోత్సవానికి డిగ్రీ పట్టాలు తీసుకునేందుకు వచ్చే విద్యార్థులు 576, వారి తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, తదితరులకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో సి ఓ ఈ డాక్టర్ వినోద్, అసోసియేట్ డీన్ డాక్టర్ పావని, అధ్యాపకులు రామారావు సృజన, కౌన్సిలర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.