42.2 C
Hyderabad
April 26, 2024 15: 13 PM
Slider కడప

అవేర్ నెస్: రాజంపేట రోడ్ల పై కరోనా సందేశం

corona roads

కడప జిల్లా రాజంపేట చిత్రకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో సోమవారం రాజంపేట పట్టణం లోని ముఖ్య కూడళ్లలో కరోనా సందేశాలను వినూత్నమైన రీతిలో రోడ్ల పై రాసి ప్రజలకు జాగృతం చేశారు. కరోనా నివారణ పై చిత్రకారులు సందేశాలు అందచేయడం కొత్తగా అనిపించింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనం గుమికూడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపద్యంలో రాజంపేట లోని చిత్రకారుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ముఖ్య కూడలల్లో స్టే హోమ్, సేవ్ లైఫ్, ప్లీస్ స్టే అట్ హోమ్, ఇంటి వద్దే ఉందాం..కరోనా మహమ్మారి ని తరిమేద్దాం అని నినాదాలు రాశారు.

ఈ నినాదాలు రోడ్ల పై వచ్చిన వారిని ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. రాజంపేట లోని చిత్రకారుల సంఘం వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది కరోనా మహమ్మారి ని నిర్ములించేందుకు సందేశాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని టౌన్ ఎస్సై ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనంద్,గణేష్, మర్రి కళ్యాణ్, చింతల శివా,రఫీ,చంద్ర,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ ప‌తాక కీర్తిని న‌లుదిక్కులా చాటాలి

Satyam NEWS

మ‌రొక సీనియర్ రిపోర్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌: యాడ్స్‌, స‌ర్క్యూలేష‌న్ కోసం ఒత్తిడే కార‌ణం

Satyam NEWS

Analysis: రష్యా తొలి వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment