39.2 C
Hyderabad
May 4, 2024 21: 27 PM
Slider తూర్పుగోదావరి

తిరుమల జూనియర్ కాలేజీలో కరోనా కలకలం

#AallaNani

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీ లో భారీ కరోనా కలకలంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. అక్కడ ఇంటర్ చదువుతున్న 163మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

కరోనా నివారణకు తీసుకో వలచిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, DMHO డాక్టర్ గౌరిశ్వరావుతో మంత్రి ఫోన్ లో మాట్లాడారు. కరోనా నివారణకు ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదేశించారు.

తిరుమల జూనియర్ కాలేజీ లో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి అదేశం జారీ చేశారు. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్ కి తరలించి RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు.

కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Related posts

మొక్కల నాణ్యత పెంచేందుకు స్వచ్చంద ధృవీకరణ

Satyam NEWS

‘మానవతా పరిమళం’ కు అనూహ్య  స్పందన

Satyam NEWS

కడప కేంద్ర రారాగారంలో ఖైదీలకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment