సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కేంద్రంగా నియోజకవర్గం పరిధిలో అక్రమ రవాణా, అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయన్న కథనాలతో హుజూర్ నగర్ పోలీసు స్టేషన్ లో జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆకస్మిక తనిఖీ పట్టణంలో చర్చాంశనీయమైనది.
జిల్లా ఎస్పీ R భాస్కరన్ శనివారం అర్ధరాత్రి హుజుర్ నగర్ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ రికార్డ్స్ పరిశీలించారు. హుజూర్ నగర్ నియోజక వర్గంలో అక్రమ వ్యాపారం జరుగుతుందని వస్తున్న కథనాల విషయమై ఏమి చర్యలు తీసుకున్నారు అని సిబ్బందిని అడిగినట్లు సమాచారం.
గుట్కా, పి.డియస్ బియ్యం, లిక్కర్, జూదం లాంటి అక్రమ వ్యాపారాలు, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించినట్లు తెలుస్తోంది. అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్స్ నమోదు చేయాలి, బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.
అక్రమ వ్యాపారాలపై, ఆర్ధిక నేరాలపై ఉపేక్షించేది లేదని ఈ సందర్బంగా ఎస్పీ హెచ్చరించారని వినికిడి. అక్రమ వ్యాపారాలకు సహకరిస్తున్నారని సిబ్బందిపై ఆరోపణలు వస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు అని సిబ్బందిని హెచ్చరించిన సమాచారం.