37.2 C
Hyderabad
April 30, 2024 11: 09 AM
Slider మహబూబ్ నగర్

ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను సత్కరించిన కళాశాల ప్రిన్సిపాల్

#interstudents

కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులతో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను  ప్రిన్సిపాల్ నరేందర్ గౌడ్ ఘనంగా సత్కరించారు. 

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు యువసేన నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్, రహీం పాష, నాగరాజు తదితరులు విద్యార్థినులను సత్కరించారు.  అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన Y దివ్య CEC 2 year 830, S. శారద MPC 2nd Year 785, కరిష్మా BPC 2nd Year 767, B లత MPC 1st Year 447, P శ్రీలత MPC 1St Year 444, K లక్ష్మి CEC 1st Year 410, అంజలి MPC 1St Year 403, G సంధ్య BPC 1st Year 387.

విద్యార్థులకు మిఠాయిలు పంచి అభినందించారు. రాజనీతి శాస్త్ర అధ్యాపకులు వినయ్ కుమార్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. మట్టిలోని మాణిక్యాల లాగా కష్టపడితే కష్టపడితే ప్రభుత్వ కళాశాలలో చదివి ప్రతిభ కనపరిచిన వచ్చని, ప్రభుత్వం అందించే నాణ్యమైన ఉచిత విద్యతో ఉన్నత ఫలితాలు సాధించవచ్చు అని “మా” విద్యార్థులు రుజువు చేశారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో కాపు నేత తోట కృష్ణయ్య పుట్టినరోజు

Satyam NEWS

అంబరాన్నంటిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Satyam NEWS

నిజామాబాద్ జిల్లాలో 2 వేలకే సిటిస్కాన్

Satyam NEWS

Leave a Comment