కోక్కొల ఫౌండేషన్ డోనర్స్, యునైటెడ్ వే ఆఫ్ ముంబై నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలో శానిటేషన్ కార్మికులకు కరోనా రక్షకాలు పంపిణీ చేశారు.
గోల్నాక డివిజన్ లోని నెహ్రూ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేస్తున్న కార్మికులకు సనిటైజర్, మాస్క్ లు, చేతి గ్లౌజులు జీహెచ్ఎంసీ ఎస్. ఎస్. ప్రతాప్ సేన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మరిన్ని ముందుకు రావాలని పగలనక రాత్రి అనకా జీహెచ్ఎంసీ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఎస్ఫ్ఏ ఆధిల్, కార్యాలయ సిబ్బంది బాలరాజు, శ్రీహరి తులసిరాం, ఎన్జీవో అడ్మిన్ డిపార్ట్మెంట్ మురళి కృష్ణ, ఇన్ ఫ్రస్టాకచార్ కోర్డినేటర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.