26.7 C
Hyderabad
May 3, 2024 08: 49 AM
Slider ముఖ్యంశాలు

కేటీఆర్ సభకు కవిత ఎందుకు రాలేదు

#MP Dharmapuri Arvind

దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సవాల్ చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ నిజామాబాద్లో మోసపూరిత వాగ్ధానాలు చేశారన్నారు.

ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తానన్నారు. కేసీఆర్ కొడుకు అనేది మాత్రమే కేటీఆర్‌ అర్హత అని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.మిషన్ కాకతీయ బడ్జెట్ అంతా కవితకు అప్పజెప్పారన్నారు.

కేటీఆర్ సభకు రాలేదని తనను అడుగుతున్నారని, మరి కవిత ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విప్ ఉండటంతో నిన్నటి కేటీఆర్ సభకు వెళ్ళలేదని ఎంపీ అర్వింద్‌ వెల్లడించారు.

Related posts

రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్‌ జీ, గురుమా

Satyam NEWS

Danger: భారత్ లో భావ ప్రకటనాస్వేచ్ఛకు భంగం

Satyam NEWS

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన శాసనసభ్యుడు

Satyam NEWS

Leave a Comment