దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 370 వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలోనే ఐదు అంశాలపై పోరాటం చేసిన వ్యక్తి అని ఈ సందర్భంగా వక్తలు అన్నారు.
ఆయన విగ్రహాల కే పరిమితం కాకుండా ఆయన అందించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దళిత బహుజన ప్రజలు రాజ్యాధికారం కోసం పట్టుబడి పోరాటాలు చేయాలని ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా బిసి విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతపల్లి సతీష్ గౌడ్ అన్నారు.
దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు తోటపల్లి మల్లేష్ జోహార్లు అర్పించి వారి ఆశయాలు ఆయన స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ యువజన మండల నాయకులు చింతపల్లి బాలస్వామి కడారి మహేష్ బాబు అంజనేయులు బాలకృష్ణ అయ్యప్ప కడారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.