ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యక్తులను థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, వారి పూర్తి వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్రీదేవసేన అన్నారు. శనివారం డొల్లరా చెక్ పోస్ట్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది తో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిని తప్పని సరిగా థర్మల్ స్క్రీనింగ్ చేసి వారి వివరాలను తెలుసుకోవాలని అన్నారు.
అలాగే జిల్లా నుండి మహారాష్ట్ర వైపు వెళ్లే వారి వివరాలను కూడా నమోదు చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయినందున తనిఖీ టీమ్ లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల బృందాలు ఈ చెక్ పోస్ట్ లో పని చేస్తున్నారని తెలిపారు.