బిచ్కుంద మండలంలోని రెవెన్యూ ఉద్యోగులకు మొదటి విడత కరోనా టీకాల పంపిణీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాస్పత్రిలో నలుగురు రెవెన్యూ ఉద్యోగులకు ఒక రెవెన్యూ సహాయకునికి టీకాల పంపిణీ చేశారు.
రెవెన్యూ ఉద్యోగులు కరోనా వైరస్ కొనసాగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ సమయంలో కూడా వీరు విధులు నిర్వహించిన విషయం విదితమే దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులకు టీకాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రావు పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు రెవెన్యూ సీనియర్ సహాయకులు రాచప్ప వైద్యులు విక్రమ్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.