38.2 C
Hyderabad
May 2, 2024 22: 25 PM
Slider ప్రత్యేకం

బీసీ స్టడీ సర్కిళ్ల కోచింగ్ ఎంట్రన్స్ కోసం ఆన్లైన్ నమోదు ప్రారంభం

#ministergangula

కోచింగ్ వివరాలను వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లకు వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సకల సన్నాహాలు చేసింది. దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో బీసీ స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికిపైగా ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేసారు.

ఈరోజు మాసాబ్ టాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టీఎస్సీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1,2,3,4 తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకం చేసే పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై వివిద రకాల ఇతర ఉద్యోగాలకు పోస్టుల వారీగా కోచింగ్ సదుపాయాన్ని అందజేస్తామన్నారు.

బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 11 స్టడీసర్కిళ్లతో పాటు మరో ఐదు స్టడీ సర్కిళ్లు సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, నర్సంపేట్, జగిత్యాలలో కూడా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి వాటి  ద్వారా కోచింగ్ని అందజేస్తామన్నారు, అదే విదంగా స్టడీ సర్కిళ్లు లేని ప్రతీ నియోజకవర్గంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సెంటర్ల ఏర్పాటు

నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక రీడింగ్ రూమ్, ఆన్లైన్ క్లాస్ రూం,  ప్యాకల్టీతో కూడిన డౌట్ క్లియరెన్స్ రూం ఇలా మూడు రూములతో కూడిన  103 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉచితంగా మౌలిక వసతుల కల్పన, ఇతర ఏర్పాట్లు ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ఏర్పాటు చేస్తే అక్కడ సైతం బీసీ స్టడీ సెంటర్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు, వీటి ద్వారా కోచింగ్ తో పాటు నాణ్యమైన స్టడీ మెటీరియల్ని అభ్యర్థులకు అందజేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25,000 మందికి నేరుగా, మరో 50,000 వేల మందికి హైబ్రిడ్ మాడల్లో ఆన్లైన్, ఆప్లైన్ మోడ్లో శిక్షణ ఇస్తామని, అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా మరో 50,000 మందికి మొత్తంగా 1,25,000 మందికి నాణ్యమైన శిక్షణ అందిస్తామన్నారు, ఈ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రతిష్టాత్మక ఆన్ అకాడమీతో కొలాబరేషన్ కుదుర్చుకున్నట్టు మంత్రి వెల్లడించారు.

కోచింగ్ సెంటర్లలో బిసిలకు 75 శాతం రిజర్వేషన్

బీసీ సంక్షేమ శాఖ అందించే కోచింగ్ లో రిజర్వేషన్లు బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మరో ఐదు శాతం మైనారిటీలకు కేటాయిస్తామన్నారు.

బీసీ సంక్షేమ శాఖ అందించే ఉద్యోగార్థుల శిక్షణ కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తక్షణమే ప్రారంభించామన్నారు, ఆన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కు నేటి నుండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16 వ తారీఖున ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో పరీక్ష ఉంటుందని 10 గంటల వరకు కూడా పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు.

ఈ పరీక్ష అభ్యర్థుల సామర్థ్యంతో పాటు వారికి ఏ ఉద్యోగం కోసం కోచింగ్ ఇవ్వాలో సైతం నిర్దారించే విధంగా ఉంటుంది అన్నారు, మొదటగా నిలిచిన 5 శాతం మందికి గ్రూప్ 1 కోసం సెలక్ట్ చేస్తామని వీరికి మెటీరియల్తో కూడిన స్టైఫెండ్ అందజేస్తామన్నారు. మిగతా వారిని మెరిట్ బేస్లో గ్రూప్ 2, ఎస్సై వంటి ఇతర శిక్షణలకు ఎంపిక చేస్తామన్నారు.

కుటుంబ వార్షికాదాయం 5లక్షల లోపు ఉన్నవారికి ఉచిత శిక్షణతో పాటు స్టైఫెండ్ ఇస్తామన్నారు. గ్రూప్ వన్ పరీక్ష కోసం ఫిలిమ్స్, మెయిన్స్ కలిపి ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు, దాదాపు పది వేల మంది అభ్యర్థులకు అందించే ఈ శిక్షణలో అర్హులైన వారికి నెలకు ఐదు వేల చొప్పున (ఇందులోనే మెటీరియల్ ఉంటుంది) ఆరు నెలలపాటు స్టైపెండ్ ను సైతం అందిస్తామన్నారు.

గ్రూప్ టు, ఎస్ఐ ఉద్యోగాల కోసం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు కోచింగ్ ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు రెండు వేల చొప్పున (ఇందులోనే మెటీరియల్ ఉంటుంది) మూడు నెలలపాటు స్టైఫండ్ అందిస్తామన్నారు. ఈ నెల 16న నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఫలితాల్ని సైతం అదే రోజు మధ్యాహ్నం నుండి తెలియ జేస్తామన్నారు.

ఆ తర్వాత ఈనెల 20 లేదా 21 నుండి కోచింగ్ క్లాస్సెస్ ప్రారంభమవుతాయి. వేల రూపాయల విలువ చేసే ఈ శిక్షణ బీసీ వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని బీసీ యువతకు పిలుపునిచ్చారు మంత్రి గంగుల.

ఈ కింది లింకుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ కోచింగ్ కు అర్హులైన వారి కోసం నేటి నుండి ప్రారంభమయ్యే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ https://studycircle.cgg.gov.in/, జ్యోతిబాపూలే గురుకుల వెబ్సైట్  https://mjpabcwreis.cgg.gov.in/, బీసీ సంక్షేమ శాఖ వెబ్ సైట్, ఇతర ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు అన్ అకాడమీ వెబ్ సైట్ https://unacademy.com/scholarship/tsgovt-scholarship-test  లోనూ అన్ లాక్ కోడ్ UNACADEMY10 ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 16 ఉదయం 10 గంటల వరకూ ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి 16న ఉదయం 11 గంటలకు ఆన్లైన్ ద్వారా పరీక్ష ఉంటుందన్నారు.

డెస్క్టాప్, ల్యాప్టాప్ లతోపాటు మొబైల్ ఫోన్ల ద్వారా పరీక్ష రాసే వీలుంటుందన్నారు. 90 నిమిషాల పాటు నిర్వహించే ఈ పరీక్షలో సామర్థ్యం ప్రకారం ఐదు విభాగాలుంటాయి, మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. నెగటివ్ మార్కులు ఉండే ఈ పరీక్షలో కాపీ కొట్టడం, చూచి రాయడానికి వీలులేకుండా టైం వుంటుందన్నారు, పరీక్షలో అభ్యర్థులకు ఆయా విభాగాల్లో వచ్చిన మార్కుల ప్రకారం ఏ కోర్సులకు ఎన్నికవుతారు అనేది నిర్ణయించి తెలియజేస్తామన్నారు.

వెనుకబడిన తరగతుల విద్యార్ధులకు ఇది ఎంతో ఉపయోగం

ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష రాసి మెరిట్ సాధించిన అభ్యర్థులకు మాత్రమే కోచింగ్ ఇస్తామని తేల్చి చెప్పారు ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పరీక్ష ముగిసిన అనంతరం గంటలోపే ఫలితాలు వెలువడేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మెకానిజం కోసం అయ్యే టెక్నాలజీ మొత్తం CSR పండు కింద UNACADEMY సొంతంగా భరిస్తుందని వారి ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన అన్ అకాడమీ ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వంతో పేద వెనకబడిన అభ్యర్థుల కోసం ఇచ్చే కోచింగ్ లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు, తెలంగాణ ప్రభుత్వం అందించే స్టైఫండ్ తో పాటు కొంతమంది మెరిట్ అభ్యర్థులకు తాము సైతం 20వేల విలువ చేసే తమ స్టడీ మెటిరియల్ని స్టైపెండ్ రూపంలో అందజేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎం జె పి గురుకుల స్కూల్ సొసైటీ సెక్రటరీ మల్లయ్య బట్టు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్, ఇతర బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆన్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

సుమన్‌ చేతుల మీదుగా ‘రంగస్వామి’ ట్రైలర్

Bhavani

విజయనగరం జిల్లా కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు

Satyam NEWS

రూ.2426.39 కోట్లు తో వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో టెక్నాలజీ అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment