మతతత్వ బిజెపి పార్టీని తరిమికొట్టి ఇండియా కూటమిని గెలిపించాలని సిపిఐ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి బుకే విశ్వనాథ నాయక్ కోరారు. ఇండియా కూటమి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా విశ్వనాథ నాయక్ ను ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా రాజంపేట ఏఐటియుసి కార్యాలయం నందు శనివారం వామపక్ష నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ నాయక్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం దేశంలో కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు చూపుతూ ఆంగ్లేయుల బాటలో కుల, మత, వర్గాలుగా విభజించి పాలిస్తోందని ఆరోపించారు.
కార్పొరేటర్లను పెంచి పోషిస్తూ పేద, మధ్యతరగతి వర్గాలను, వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య పీడితులు నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గం పెత్తందార్ల చేతిలో నలిగిపోయిందని, నాయకుల అధికార దాహానికి అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి 43 మంది జల సమాధి అయ్యారని ఆరోపించారు. వరద బాధితులకు నేటికీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన పాపాన పోలేదని ఆవేదన చెందారు. వైద్య కళాశాల మదనపల్లికి తరలిపోవడం వెనుక రాజంపేట పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతోందని అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రజల కష్టసుఖాలను అవలోకనం చేసుకోగలనని తెలిపారు.
తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల గలాన్ని చట్టసభలలో వినిపిస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సెక్రెటరీ నరసింహులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలు రవికుమార్, రాజంపేటసిపిఐ ఏరియా కార్యదర్శి సహాయ కార్యదర్శిఎమ్మెస్ రాయుడు శివరామకృష్ణదేవరా , ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఈ.సికిందర్ సిపిఐ రైల్వే కోడూరు ఏరియా సెక్యూరిటీ సి చిన్నయ్య సిపిఐ నాయకులు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.