ముస్లింలకు స్మశాన వాటిక కూడా ఏర్పాటు చేయలేని హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీని అంబర్ పేట్ పర్యటనలో అడ్డుకుంటామని సిపిఐ అంబర్ పేట ఇన్ చార్జి నదీం తెలిపారు. తన జన్మదినం సందర్భంగా అంబర్ పేట్ కాచిగూడలో గల అంజుమన్ అనాధ ఆశ్రమానికి వస్తున్న హోమ్ మంత్రి ముందుగా ముస్లింల సమస్యలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అంబర్ పేట్ లో ముస్లిం స్మశానవాటికలో ఖననం చేయడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ పుట్టిన రోజు జరుపుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. అందుకే జన్మదిన వేడుకలకు వస్తున్న సందర్భంగా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. మైనార్టీలకు ఖననం చేయడానికి స్మశాన వాటిక తక్షణమే ఇవ్వాలని లేని పక్షాన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఆయన అన్నారు.
previous post