విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ బోయపాడు గ్రామంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. సంఘటన గురించి తెలుసుకున్న వారు ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకున్నారు. బోయపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక తొమ్మిదో తరగతి వరకు చదివింది. ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటున్నది. అదే గ్రామానికి చెందిన బాలుడు (వయసు 17 సంవత్సరాలు) కూడా ఇంటర్ పూర్తి చేశాడు. అతడు కూడా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే బాలిక , బాలుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత మరింత దగ్గరయ్యారు. కొన్ని నెలల తర్వాత బాలిక అనారోగ్యం బారిన పడింది. తల్లిదండ్రులు బాలికను 30 రోజుల కిందట నర్సీపట్నం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా వైద్యుల పరీక్షల్లో బాలిక 8 నెలల గర్భిణీ అని తేలింది. దీంతో మైనర్ బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడిని అరెస్ట్ చేసి జువెనైల్ హోంకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
previous post