39.2 C
Hyderabad
May 3, 2024 11: 27 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో యాసంగి పంట వెరిఫికేషన్ ప్రారంభం

#summercrop

గ్రామాల వారీగా యాసంగి పంటల వెరిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయింది. ఇప్పటికే నమోదు చేసుకున్న యాసంగి పంటలను క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం లోని నార్లపూర్ చెంచు గూడెం గ్రామంలో పంటల నమోదు ను మండల వ్యవసాయ అధికారి నాగరాజు తనిఖీ చేశారు. రైతు బంధు పోర్టల్ లో ఆన్ లైన్ లో AEO లు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటను నమోదు చేశారు. వారు నమోదు చేసిన పంటలను AO తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో AEO మోహన్ కుమార్ తో బాటు చెంచు గూడెం రైతులు పాల్గొన్నారు.

Related posts

మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా

Satyam NEWS

దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న సత్యం కుటుంబం

Satyam NEWS

ఫడ్నవిస్ ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ సంబరాలు

Satyam NEWS

Leave a Comment