గ్రామాల వారీగా యాసంగి పంటల వెరిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయింది. ఇప్పటికే నమోదు చేసుకున్న యాసంగి పంటలను క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం లోని నార్లపూర్ చెంచు గూడెం గ్రామంలో పంటల నమోదు ను మండల వ్యవసాయ అధికారి నాగరాజు తనిఖీ చేశారు. రైతు బంధు పోర్టల్ లో ఆన్ లైన్ లో AEO లు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటను నమోదు చేశారు. వారు నమోదు చేసిన పంటలను AO తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో AEO మోహన్ కుమార్ తో బాటు చెంచు గూడెం రైతులు పాల్గొన్నారు.
previous post