39.2 C
Hyderabad
May 3, 2024 14: 41 PM
Slider మహబూబ్ నగర్

మాదిగ అమర వీరుల త్యాగం ఎంతో గొప్పది

#kollapurmadiga

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకాలో తెలంగాణ దండోరా తాలూకా కమిటి ఆధ్వర్యంలో నేడు అమర వీరుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ జాతి హక్కుల కోసం తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాటం చేసిన అమరులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. వర్గీకరణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన అమరవీరుల స్మరించుకుంటూ ఆశయాలను కొనసాగిస్తామని ఆయన అన్నారు.

గత 27సంవత్సరాల నుంచి SC వర్గీకరణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన మాదిగ అమర వీరులకు తెలంగాణ దండోరా ఘన నివాళి అర్పిస్తున్నదని ఆయన తెలిపారు. కొల్లాపూర్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ముందు జరిగిన ఈ కార్యక్రమంలో మాదిగ అమర వీరులు  దామోదర్ మాదిగ , సురేందర్ మాదిగ, మహేష్ మాదిగ, తాడిపత్రి రవి మాదిగ, రామకృష్ణ మాదిగ, దేవన్న మాదిగ, పెబ్బె జివక్కమాదిగ మరొ 40 మంది అమరవీరుల ఆత్మ శాంతిచాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర కార్యదర్శి కల్మురి రాముడు మాదిగ, నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇంఛార్జి మంతాటి గోపీ మాదిగ, జిల్లా గౌరవ అధ్యక్షులు DK మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి అదిరాల వెంకటయ్య మాదిగ, మహిళా జిల్లా అధ్యక్షులు బాకీ రేణుక మాదిగ, కొల్లాపూర్ తాలూక అధ్యక్షులు మల్లె వెంకటస్వామి మాదిగ, నిరంజన్ మాదిగ, మల్లయ్య మాదిగ, బాలరాజు, చంద్, రాముడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాళ్లూరి కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

Murali Krishna

బిజెపి పాలనపై పీడత ప్రజలు పోరాడాల్సిన సమయం ఇది

Satyam NEWS

జగన్ మాట అలీ నోట

Satyam NEWS

Leave a Comment