33 వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిస్తే డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని సీపీఎం అభ్యర్థి రెడ్డి శంకరరావు ప్రజలకు వాగ్దానం చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ మాటలు అన్నారు.
ఇంటింటి ప్రచారం చేస్తూ విస్తృతంగా పర్యటించారు. అనంతరం నగరంలో ని 33వ డివిజన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనను డివిజన్ ప్రజలు గెలిపిస్తే ఏం చేస్తానో ముందు గానే ఓ ప్రణాళిక విడుదల చేసారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం ప్రజలు కు అందు బాటు లో వుండి.. ప్రజా సమస్యల పై పోరాడుతున్న ప్రజా సేవకుడు నని అధికారం ఇస్తే అది ప్రజల కే ఉపయో గిస్తానని అన్నారు..
33 వ డివిజన్ కార్పొరేటర్ సీపీఎం పార్టీ అభ్యర్థి రెడ్డి శంకరరావు. ఈ మేరకు నిర్వహించిన మీడియా మీట్ లో సీపీఎం నేతలు.. పార్టీ అభ్యర్థి శంకరరావు ను గెలిపిస్తే 33 వ డివిజన్ లో సమస్యలపై కార్పొరేషనలో ప్రశ్నిస్తారని అన్నారు.
ప్రజాసమస్యల పై పోరాడే చరిత్ర కమ్యూనిస్టు పార్టీలు కు మాత్రమే వుంది అని అన్నారు. శంకరరావును గెలిపిస్తే ఆస్తి పన్ను భారాలు రద్దు చేయాలని పోరాడుతారని ఇప్పటికే ఈ సమస్య పై పోరాడుతున్నారన్నారు.
నిరంతరం ప్రజాసమస్యల పై పోరాడుతున్నామని,ఒక్కసారి అవకాశమిస్తే డీవిజన్ ప్రజలు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పోరాడుతారని కార్పొరేషన్ లో ప్రజా సమస్యల పై ప్రజావాణిని వినిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా నేతలు ఆనంద్,మణికంఠ, జగదాంబ, రామకృష్ణా,చిన్నమ్మలు,సురేష్ తదితరులు పాల్గొన్నారు.