కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలోని చార్బాయ్ బీడీ కార్మికులకు ఇల్లా స్థలం, డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని CPM జుక్కల్ జోన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గం కార్యదర్శి సురేష్ గొండ మాట్లాడుతూ జుక్కల్ మండలంలో చార్బాయ్ బీడీ కార్మికులు 30 సంవత్సరల నుండి చాలి చాలని వేతనాలతో వారి జీవన ఆధారం కొనసాగుతుందని, అద్దె భవనాలలో ఉంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. కావున వారికీ ఇల్లా స్థలము ఇవ్వాలని కోరుతు తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం స్థలము చూసి వారికీ కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. అజయ్ కుమార్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, జుక్కల్ మండలం అధ్యక్షులు సీఐటీయూ ఆడేప్ప, నాయకులు మోతిరం నాయక్, రాములు, సాగర్ సాయిలు బీడీ కార్మికులు పాల్గున్నారు. జీ లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం
previous post