ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు వాటి రద్దును నిరసిస్తూ…ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత ఆరు నెలల నుంచీ కిసాన్ సంఘం రైతులతోధర్నా నిర్వహిస్తోందికూడ. ఈ రెండు సంఘటనలు జరిగినా కేంద్రంలోమోడీ ప్రభుత్వం లోచలనం రావటం లేదని అందుకు నిరసనగా ఈ నెల 27 భారత్ బంద్ నకు పిలుపు నిచ్చింది.
ఆ బంద్ నకు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. తాజాగా విజయనగరం జిల్లా సీపీఎం పార్టీ….భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ…నగరంలోని ర్యాలీ చేపట్టింది. ఈమేరకు కోట వద్ద నుంచీ మూడు లాంతర్లు, గంటస్తంబం,కన్యకాపరమేశ్వరి టెంపుల్ వరకు సీపీఎం ర్యాలీ నిర్వహించింది. ఈసందర్బంగా సీపీఎం నేత కృష్ణ మూర్తిమాట్లాడుతూ…మోడీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం…కార్పొరేట్ రంగాలకు కొమ్ము కాస్తోందన్నారు.
అందులోభాగమే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమని ఆరోపించారు. ఆ రద్దును నిరసిస్తూ…గత ఆరు నెలల నుంచీ రైతులందరూ దేశరాజధానిలోధర్నా చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదన్నారు.ఆ నిరంకుశత్వ, మతతత్వవిధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27 భారత బంద్ నకు పిలుపు నిచ్చామన్నారు.
ఆ బంద్ ను జయప్రదం చేయాలని స్వచ్చందంగా షాపులు మూసేయాలని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని సీపీఎం నేత కృష్ణమూర్తి అన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి శంకరరావు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.