క్రేన్ సంస్థల చైర్మన్ గా నేడు గ్రంధి లక్ష్మీ కాంతారావు బాధ్యతలు స్వీకరించారు. క్రేన్ సంస్థల అధినేత గ్రంధి సుబ్బారావు తదనంతరం ఆయనకు నేడు పట్టాభిషేకం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని సంపత్ నగర్ లో ఉన్న క్రేన్ కంపనీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి హాజరయ్యారు. క్రేన్ సంస్థల అధినేత గ్రంధి సుబ్బారావు తదనంతరం నూతనంగా అధికారంగా క్రేన్ సంస్థల చైర్మన్ బాధ్యతలను స్వీకరించిన గ్రంధి లక్ష్మీ కాంతారావుకు ఆయన అభినందనలు తెలిపారు.