క్రెడాయి విజయవాడ 8 వ ప్రాపర్టీ షో అక్టోబర్ 1, 2 వ తేదీలలో ( రెండు రోజుల పాటు) ఏ కన్వెన్షన్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షో ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శాసన సభ్యులు, ముఖ్య అతిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రసంగిస్తూ ప్రస్తుతం మన దేశం కరోనా నుండి నెమ్మదిగా కోలుకుంటున్న సందర్భంలో, విజయవాడ క్రెడాయి వారు ముందుకువచ్చి ఈ ప్రాపర్టీ షో ను జరపడం చాలా గొప్ప విషయం అన్నారు.
నిర్మాణ రంగం లొనే కాక క్రెడాయి విజయవాడ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించటం గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రతి మధ్య తరగతి వారి కల అయిన సొంతిల్లు ను సాకారం చేస్తున్న క్రెడాయి విజయవాడ చాప్టర్ వారు గృహ పరికరాలకు సంబంధించిన అన్ని రకాల వారిని ఒకే వేదిక పైకి తేవడం ముదావహమని అన్నారు. విజయవాడ తూర్పు శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణం రంగానికి చెందిన బిల్డర్లకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పారు.
ఈ సభలో విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జి.ఎమ్ ఓం నారాయణ శర్మ, డి.జి.ఏం. కె.రంగరాజన్, స్థానిక కార్పొరేటర్ రేష్మ కూడా పాల్గొన్నారు. వక్తలందరు కూడా ప్రాపర్టీ షోను ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు క్రెడాయి విజయవాడ ప్రెసిడెంట్ కె.రాజేంద్ర, కార్యదర్శి కె.రమేష్ అంకినీడు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వై.వి.రమణా రావు, దాసరి రాంబాబు, వి.శ్రీధర్ ను అభినందించారు. ఆర్.వి.స్వామి, తుమ్మల వంశీ, బోయపాటి చందు, కె.వి.వి.రవికుమార్, కె.తేజేశ్వర రావు, మండవ సుధాకర్ ఇతర క్రెడాయి విజయవాడ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రాపర్టీ షో విజయవంతంగా జరగటానికి కృషి చేసారు.