న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జిల్లా ఎస్ పి రీమా రాజేశ్వరి హెచ్చరించారు.
మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చే వారిని అడ్డుకోవడానికి రెండు రకాల పోలీసు బృందాలు పని చేస్తుంటాయని ఆమె తెలిపారు.
మద్యం తాగి రోడ్డుపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.
హాయిగా,సంతోషంగా కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోండి అంటూ ఆమె హితవు పలికారు.