వైసిపి ఆవిర్భావం దినోత్సవం కాదు.. అరాచక దినోత్సవం గా అభివర్ణించారు టిడిపి పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే అనిత. గురువారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసిపి తప్పుడు పనులకు సాక్షి కరపత్రం గా మారిందని ఆరోపించారు.
రాయలసీమ ముద్దు బిడ్డ జగన్న అంటూ ఒక మంత్రి టిక్ టాక్ చేయడం పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇదేమి న్యాయం అంటూ ఆమె ప్రశ్నించారు. టిడిపి అంటే వైసీపీకి భయం..అందుకే నామినేషన్ లు అడ్డుకుంటున్నరని ఆరోపించారు.
జగన్ 9 నెలల పాలనలోకనీసం 9 సామాజిక వర్గాలు అయిన సంతోషంగా ఉన్నాయా అని ఎదురు ప్రశ్నించారు. ఓడిపోతామని తెలిసిననా ..వర్ల రామయ్య హాపీగా నామినేషన్ వేస్తున్నారు దళితులకు అన్యాయం చేసింది వైసిపి ప్రభుత్వమేనని ఆరోపించారు.
టిటిడి బోర్డు లో ఒక దళితుడు లేడు..అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కడప నుండి ఫ్యాక్షన్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నరని ఆమె అన్నారు. మీ పరిపాలన అంత ప్రజలు గమనిస్తున్నారని రానున్న కాలంలో ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారని అనిత అన్నారు.