తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రోగ్రాం కార్యదర్శిగా పసల ప్రసాద్ నియమితులయ్యారు.
ఈ మేరకు టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు ఎం కె బోస్ గురువారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, రాష్ట్ర అధ్యక్షులు బోస్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పసల ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.