జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉదయాన్నే ప్రముఖులు ఆయా పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నందినగర్లో కుటుంబ సభ్యులతో వచ్చి మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాచిగూడలో కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ క్లబ్లో చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కుందన్బాగ్లో రాచకొండ సీపీ ఓటు హక్కు వినియోగించుకోగా, నాంపల్లిలో సీపీ సజ్జనార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఓటు హక్కు ద్వారానే సుపరిపాలన అందుతుందనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. నగర అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఇక ఓటు హక్కు వినియోగించుకున్న పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ నిర్భయంగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.