తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని దళిత జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలని జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దళిత జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు పంగిడి చెరువు వెంకటస్వామి మాట్లాడుతూ దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలోని ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలిసి దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం మంజూరు చేసే విధంగా ప్రతి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు అందులో భాగంగానే నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వినతిపత్రం వేయడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో దళిత జర్నలిస్టులు ఎందరో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని,వారందరినీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఆదుకొని ఆర్థికంగా దళితులను అభివృద్ధి చిందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి శేఖర్.జిల్లా ప్రధాన కార్యదర్శి కరిగళ్ళ సుదర్శన్, బంగారయ్య తదితరులు ఉన్నారు