నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయ పల్లిలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ సేవా సమితి అధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవిని గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు రోజుకొక్క అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
శుక్రవారం శుద్ద సప్తమి ఏడవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు కనుల విందు చేశారు. సమితి సభ్యుల ఆధ్వర్యంలో మంటపంలో భక్తులు, ఆడపడుచుల కోలాటాలు, బతుకమ్మ పాటల కోలాహలాల నడుమ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.
దేవీ శరన్నవరాత్రి మంటప నిర్వహణ పై గ్రామ సేవాసమితి సభ్యుల కృషికి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల సహకారం ఎల్లవేళల ఇలానే ఉండాలని కోరుకుంటునట్లు తెలిపారు.