నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో దారుణం జరిగింది. పండగపూట ఒకడు కన్నతల్లినే నరికి చంపాడు.
మద్యానికి బానిస అయిన పుట్ట రాము ఎలియాస్ నడిపిఅన్న (45) మద్యం డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. తల్లి చంద్రమ్మ మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె తలను నరికేశాడు.
ఆ తలను తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు. నేటి తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటన ఇక్కడ సంచలనం సృష్టించింది.
ఇంతవరకు నిందితుడు కనపడలేదు. పోలీసులు, గ్రామస్తులు అతని కోసం వెతుకుతున్నారు.