రైతు కోసం…తెలుగు దేశం ధర్నా చేయడంతో విజయనగరం దద్దరిల్లిపోయింది. విజయనగరం జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న విజయనగరం ఎమ్మెర్వో ఆఫీసు ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ నేడు నిరసన ధర్నా నిర్వహించింది.
రైతులు సమస్యలపై ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చేందుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఐవీపీరాజు, మైనార్టీ విభాగం నేత అనురాధ బేగం ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లంతా విజయనగరం ఎమ్మెర్వో ఆఫీసుకు వచ్చారు. రైతు సమస్యలపై ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మెర్వో ఆఫీసుకు వెళ్లగా… ఎమ్మెర్వో సీట్లో లేకపోవడంతో…ఆఫీసులో డీటీకి వినతి పత్రం ఇచ్చారు.
అనంతరం ఎమ్మార్వో ఆఫీసు ప్రాంగణంలోనే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రైతు కోసం ఆభరోసా..ఈభరోసా అని కేంద్రాలు తెరుస్తున్నారే తప్ప అక్కడ రైతులకు ఒనగూరే ఒక్క పని జరగటం లేదన్నారు. తక్షణం రైతులు ఆదుకునే విధంగా జగన్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.