33.7 C
Hyderabad
April 29, 2024 00: 10 AM
Slider విజయనగరం

రైతు కోసం….తెలుగుదేశం అంటూ నిన‌దించిన ప్ర‌తిప‌క్ష పార్టీ…!

#tdpvijayanagaram1

రైతు కోసం…తెలుగు దేశం ధర్నా చేయడంతో విజయనగరం దద్దరిల్లిపోయింది. విజయనగరం జిల్లా కేంద్రంలో రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఉన్న విజ‌య‌న‌గ‌రం ఎమ్మెర్వో ఆఫీసు ప్రాంగ‌ణంలో తెలుగుదేశం పార్టీ నేడు నిరసన ధర్నా నిర్వహించింది.

రైతులు స‌మ‌స్య‌ల‌పై ఎమ్మార్వోకు విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఐవీపీరాజు, మైనార్టీ విభాగం నేత  అనురాధ బేగం ఆధ్వ‌ర్యంలో తెలుగు తమ్ముళ్లంతా విజ‌య‌న‌గ‌రం ఎమ్మెర్వో ఆఫీసుకు వ‌చ్చారు. రైతు స‌మ‌స్య‌ల‌పై ఎమ్మార్వోకు విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు ఎమ్మెర్వో ఆఫీసుకు వెళ్ల‌గా… ఎమ్మెర్వో సీట్లో లేక‌పోవ‌డంతో…ఆఫీసులో డీటీకి విన‌తి ప‌త్రం ఇచ్చారు.

అనంత‌రం ఎమ్మార్వో ఆఫీసు ప్రాంగ‌ణంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేసారు. రైతు కోసం ఆభ‌రోసా..ఈభ‌రోసా అని కేంద్రాలు తెరుస్తున్నారే త‌ప్ప  అక్క‌డ రైతులకు ఒన‌గూరే ఒక్క ప‌ని జ‌ర‌గ‌టం లేద‌న్నారు. త‌క్ష‌ణం రైతులు ఆదుకునే విధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌రైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

Related posts

పవన్ కల్యాణ్ సీఎం కావాలని మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కిన మహిళ…

Bhavani

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

ఈటెల లా దూసుకువచ్చిన మాటలు

Satyam NEWS

Leave a Comment