రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ రాత్రి కొనసాగుతున్న కర్ఫ్యూని పగటి పూట కూడా కొనసాగించాలని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఉదయం 6 నుంచీ మధ్యాహ్నం 12 వరకు మాత్రమే షాపులు తెరచుకోవాలని ఆదేశించింది.మధ్యాహ్నం 2 నుంచీ ఉదయం 6 వరకు సంపూర్ణంగా లాక్ డౌన్ అమలుచేస్తున్నట్టు జగన్ ప్రభుత్విం నిర్ణయించింది.ఈ మేరకు అన్నిజిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి.
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం జగన్ సమక్షంలో జరిగిన అత్యున్నత స్థాయీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి నుంచీ. పాక్షిక కర్ఫ్యూ అమల చేయనున్నారు రెండు వారాల పాటు ఆంక్షలు అమలులోఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి
మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులు తెరచుకోవచ్చు..కాగా ఆ సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది.