ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారాంపురం కొష్టాల సెంటరునుండి గురవారెడ్డిపాలెం వెళ్లే రోడ్డులో గల నేలటూరు చెరువు వద్ద నేలటూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన యర్రజానీ అంకమ్మరావు అనే ఇరవై ఏళ్ల యువకుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ప్రేమ వ్యవహారమే ఈ సంఘటనకు కారణమని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి ఎనిమిదిగంటల సమయంలో నలుగురు వ్యక్తులు అంకమ్మరావు ఇంటికి వద్దకు వచ్చి వేరే మేస్త్రీ పిలుస్తున్నాడని చెప్పి అంకమ్మరావుని తీసుకునిపోయి అతనితో పాటే మద్యం సేవించి అనంతరం ఈ ఘటనకు ఆ వ్యక్తులు పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని మద్దిపాడు పోలీసులు విచారణ చేస్తున్నారు.