మహిళలు స్వయంకృషితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, తమ కాళ్లపై తాము నిలబడాలని అన్నారు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి. బుధవారం మాదాపూర్ డివిజన్ చందానాయక్ తండాలో మండల లావణ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేకప్ స్టూడియోను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిచారు.
అనంతరం మేకప్ స్టూడియోలో నూతన టెక్నాలజీ గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ మహిళలు స్వయంగా ఎదగడానికి ఇలాంటి వ్యాపారులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
లావణ్య మేకప్ స్టూడియో వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొని మరింత అభివృద్ధి దిశగా వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవి, రాములు, హున్య నాయక్, వినోద్, లక్ష్మీ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.