జిల్లాలో అర్హులైన వారందరికి ప్రభుత్వ ఉత్వర్వు నెం.58, 59 ద్వారా పట్టాలు అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఐ.డి.ఓ.సి సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో జి.ఓ.58, 59 క్రింద అందిన దరఖాస్తులు, పెండిరగ్ దరఖాస్తులు, తీసుకున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్దిదారులకు రెగ్యులరైజ్ చేయించుకోవడం వల్ల కలిగి ప్రయోజనాలను వివరించి వెంటనే చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసలుకోవాలన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.మదుసూదన్, జిల్లా రెవెవన్యూ అధికారి శిరీష, సర్వేల్యాండ్ రికార్డ్ ఏ.డి శ్రీనివాస్, ఖమ్మం, కల్లూరు ఆర్.డి.ఓలు రవీంధ్రనాద్, సూర్యనారాయణ, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.