39.2 C
Hyderabad
May 3, 2024 11: 41 AM
Slider ఖమ్మం

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి

#10 people were seriously injured

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో తారాజువ్వ పడటంతో సమీపంలోని గుడిసెకు నిప్పు అంటుకుంది.


దీంతో గుడిసెలోని గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. అయితే ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు కాళ్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts

రివెంజ్: నిమ్మగడ్డపై వేటుకు రంగం సిద్ధం

Satyam NEWS

బడిబయట విద్యార్థులను గుర్తిస్తున్న సమగ్ర శిక్ష ఒప్పంద అధ్యాపకులు

Satyam NEWS

ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జయంతి వేడుక

Satyam NEWS

Leave a Comment