వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తాళ్ళచెరువు, అమ్మ చెరువు కట్టలపై ఎస్ఎన్ఆర్ మార్కు, కెసిఆర్ అండ్ ఎస్ఎన్ఆర్ మార్కును తొలగించాలని కోరారు. సిమెంట్ ద్వారా పేర్లు వ్రాశారని తెలిపారు. అక్కడ నిర్మాణం చేసిన రోడ్డు, చెరువు కట్టలు ప్రజల సొమ్ముతో నిర్మాణం చేశారని ఇలాంటి అనుమతులు లేకుండా పై తెలిపిన పేర్లతో చెరువు కట్టలపై నిర్మాణంపై క విచారించి పెట్టిన పేర్లను తొలగించాలని కోరారు. వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు, సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐ అండ్ సిఎడి ఇరిగేషన్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాముడు, మున్సిపల్ కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు, బ్రహ్మం చారి, కౌన్సిలర్ జయసుధ మధు గౌడ్, కౌన్సిలర్ సుమిత్ర యాదగిరి, కౌన్సిలర్ విభూతి నారాయణ, కౌన్సిలర్ లక్ష్మీ రవి యాదవ్, కౌన్సిలర్ చీర్ల సత్యం సాగర్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి. వెంకటేష్, ప్రకాష్ రెడ్డి, సింగోటం, రఘు, యాదగిరి, మహమ్మద్ రఫిక్, ఎస్. కురుమూర్తి పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్