రోజూ రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొల్లపూర్ సర్కిల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆయన కోరారు. సామాజిక దూరం పాటించాలని సిఐ కోరారు.
అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించటం, శుభకార్యాలు, వివాహాలు, షాపింగ్స్ అని అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండటo ద్వారా ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చునని సిఐ తెలిపారు. అదే విధంగా రాజకీయ పార్టీలు ఇతర సంస్థలు ఎవరూ కూడా ధర్నాలు, రాస్తారోకోలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు.
ఎవరైనా అలాంటివి నిర్వహిస్తే DM Act ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు. కావున ప్రజలందరూ ఈ సూచనలను తూచా తప్పకుండా పాటించి కొల్లపూర్ లో కారోనాని రాకుండా చేద్దామని సిఐ అన్నారు.