ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు తీవ్ర జ్వరం సోకింది. అదే సమయంలో శ్వాస పీల్చేందుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దాంతో గత రాత్రి ఆయనను ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు.
రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యేంద్ర జైన్ కు కరోనా పరీక్షలు కూడా జరిపారు. టెస్టు రిజల్స్ ఇంకా రావాల్సి ఉంది. అయితే రాజీవ్ గాంధీ ఆసుపత్ర కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శాల. అక్కడ చికిత్స పొందుతున్నందున ఆయనకు కరోనా వచ్చినట్లుగా నే చెబుతున్నారు.